Thursday, May 9, 2024

కొత్త‌గా 7,231క‌రోనా కేసులు-37మంది మృతి

నేడు కొత్త‌గా 7,231క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 37మంది క‌రోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు. మరో 62,748 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9828 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని, మరో 37 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 2.98 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.14 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.67 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక దేశవ్యాప్తంగా 212.52 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement