Friday, May 3, 2024

బోయ గాయత్రికి జాతీయ మహిళా రత్న అవార్డు

పెనుగొండ పట్టణానికి చెందిన సమాజ సేవకులు గాయత్రి మదర్ థెరిసా జాతీయ మహిళా రత్న పురస్కారానికి ఎంపికయ్యారు.. మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4వ తేదీ హైదరాబాద్ లోని ఎన్జీవో’స్ నెట్వర్క్ కాన్ఫరెన్స్ హాలులో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును గాయత్రికి ప్రదానం చేస్తారు.. కరోనా విజృంభిస్తున్న సమయంలో కరుణను లెక్కచేయకుండా ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలన్న దృక్పథంతో లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు నిరంతరం ప్రజాసేవకే అంకితమై పులు సేవా కార్యక్రమాలు వైద్య,పోలీసు,పాత్రికేయులకు మజ్జిగ,అల్పాహారాలు పంపిణీ చేసి మన్ననలు పొందారు గాయత్రి. ఈ అవార్డు కు తనను ఎంపిక చేసిన ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ కుమార్ కు గాయత్రి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement