Friday, April 19, 2024

చలాన్లు వెంటనే చెల్లించాలి..

రామాయంపేట : పెండింగ్‌ చలాన్లు చెల్లించకుంటే అటువంటి వాహనాలను సీజ్‌ చేస్తామని రామాయంపేట ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలు నెలలు మొదలు కొని చాలామంది ద్విచక్ర వాహనదారులు పెండింగ్‌ ఫైన్‌లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా పెండింగ్‌ బిల్లులు చెల్లించని వాహనాలను సీజ్‌ చేసి కోర్టులో హాజరు పర్చడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా పెండింగ్‌ చలాన్లు చెల్లించని వారు తక్షణమే వాటిని చెల్లించాలని రాజేష్‌ సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పెండింగ్‌ ఫైళ్లను పరిష్కరించుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement