Sunday, April 28, 2024

ఘోర రోడ్డు ప్రమాదం… త‌ల్లీకూతురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నె సమీపంలో ఆదివారం ఉదయం జాతీయ రహదారిపై డివైడర్‌ను కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో తల్లీ, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన రఘువరన్ రాజు కుటుంబ సభ్యులు లేపాక్షికి వెళ్తుండగా గార్లదిన్నె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొనడంతో కారులో అందులో ప్రయాణిస్తున్న జయంతి (42), కీర్తన (10) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement