Wednesday, May 1, 2024

ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం

కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆయశ శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం శ్వాస సంబంధిత మిషన్‌ సాయంతో కాస్త హాయిగా శ్వాస తీసుకుటున్నారని, త్వరితగతిన పూర్తిగా కోలుకుంటారని తెలిపింది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మణిపాల్‌ హాస్సిటల్‌ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ దగ్గరుండి మరీ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement