Sunday, April 28, 2024

AP: లారీ ఢీకొని ఇద్దరు మృతి..18 గొర్రెలు దుర్మరణం….

డి హీరేహాళ్, జనవరి 31 (ప్రభ న్యూస్): మండలంలోని జాతీయ రహదారి జాజరకల్లు టోల్గేట్ వద్ద ఐచర్ వాహనం ఢీకొని 18 గొర్రెలు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని మడేనహళ్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి రుద్రుడు మరో వ్యక్తి కలిసి తమ గొర్రెలను గ్రామం నుండి మేత కోసం నాగలాపురం గ్రామానికి తరలిస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం తెల్లారి జామున 5 గంటలకు జాతరకల్లు టోల్గేట్ సమీపంలో ఓ లారీ అతివేగంగా వచ్చి గొర్రెల మందపై , ఇద్దరు వ్యక్తులపై నుంచి దూసుకెళ్లింది. ఈఘ‌ట‌న‌లో 18 గొర్రెలు మృతి చెందగా, గొర్రెల కాపరి రుద్రడు ప్రమాద స్థలంలోని మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలు పాల్పడంతో చికిత్స కోసం బళ్లారి ఆసుపత్రికి తరలించగా మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న హీరోహళ్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదంపై విచారణ జరిపి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement