Thursday, April 25, 2024

AP Cabinet: మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్న‌ల్.. ఇంద‌న‌రంగంలో భారీ పెట్టుబ‌డుల‌కు ఆమోదం…

అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు.. కేబినెట్‌లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్‌.. మరోవైపు.. వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఫిబ్రవరి నెలలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేసింది.. ఇక, ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రిమండలి..

ఇక, ఇంధన రంగంలో 22వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం. ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.. 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కు ఆమోదం లభించింది.. దాదాపు 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనున్నారు.. ఆగ్వాగ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. 4 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.. ఇక, ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement