Sunday, April 28, 2024

HYD: కేసీఆర్ కుట్రలను నిరసిస్తూ… టీజేఎస్ నిరసన..

ఎల్ బి నగర్, జనవరి 31 : తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి ఎన్నికను అడ్డుకుంటున్న కేసీఆర్ కుట్రలను నిరసిస్తూ తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎల్ బి నగర్ క్రాస్ రోడ్స్ లో తెలంగాణ మలిదశ తొలి అమరుడైన శ్రీకాంతా చారి విగ్రహం వద్ద నల్ల‌ రిబ్బన్ లు ధరించి కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా టీజేఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్ హాజరై మాట్లాడుతూ… కోదండరాంపై కేసీఆర్ కుట్రలు కొత్తేమి కాదని, గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక రకాల దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టబద్రుల శాసనమండలి ఎన్నికల్లో కోదండరాం పోటీ చేస్తే వందలాది కోట్లు ఖర్చుపెట్టి ఓడించారని పేర్కొన్నారు. కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడమే కాకుండా అనేక రకాల కేసులను పెట్టి గత తొమ్మిది సంవత్సరాలుగా పలు రకాల దాడులకు పాల్పడ్డ కేసీఆర్ చట్టసభలకు ఎన్నిక కాకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులు వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి నాయ‌కులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement