Sunday, April 28, 2024

AP: వైసిపి- టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ

కడప, ప్రభ న్యూస్: కడప జిల్లా ముద్దనూరులో వైసిపి- టిడిపి వర్గీయుల మధ్య బుధవారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు.

ముద్దనూరు స్టేట్ బ్యాంకు వద్ద టిడిపి నాయకులు కుడుముల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో చేరికలు ఉండడంతో టిడిపి శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. పక్కనే మాజీ ఎంపిపి మునిరాజా రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసిపి శ్రేణులు, నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మేన మామ అయిన మునిరాజా రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరికొందరు నాయకులు శశిధర్ రెడ్డి నివాసంలోకి చొరబడి దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి ఘటనా స్థలానికి రావడంతో ఇరువురు మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీంతో పరస్పరం రాళ్లు విసురుకున్నారు. మాజీ అధ్యక్షులు శివరామి రెడ్డి పై దాడి చేశారు. టిడిపి నాయకులు భూపేష్ రెడ్డి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉధృతంగా మారింది. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి అదనపు పోలీస్ బలగాలు చేరుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement