Wednesday, May 8, 2024

తాడిప‌త్రిలో విజ‌యం దిశ‌గా జెసి ప్ర‌భాక‌ర‌రెడ్డి….

తాడిపత్రి మున్సిపాలిటీ 24 వ వార్డు లో తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి 1001 మెజార్టీతో ముందంజలో ఉన్నారు.. అనంత‌పురం జిల్లాలో టిడిపికి కీల‌క‌నేత‌గా ఉన్న జెసి ప్ర‌భాక‌ర‌రెడ్డి గ‌తంలో ఎమ్మెల్యే గా ప‌ని చేశారు.. 2019 ఎన్నిక‌ల‌లో ఓడిపోయారు.. అయితే అనూహ్యంగా తాడిప‌త్రి మునిసిపాలిటీ ఎన్నిక‌ల‌లో వార్డు స‌భ్యుడిగా బ‌రిలోకి దిగారు.. వివిధ కార‌ణాల‌తో ఆయ‌న త‌న వార్డులో ప్ర‌చారం కూడా స‌రిగా చేసుకోలేకపోయారు.. అయిన‌ప్ప‌టికి త‌న స‌మీప వైసిపి అభ్య‌ర్ధి కంటే 1001 ఓట్ల మెజార్టీతో ముందు ఉన్నారు.. మ‌రికొద్ది సేప‌టిలో ఈ వార్డు ఫ‌లితం ప్ర‌క‌టించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement