Monday, May 6, 2024

ఘనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

హిందూపురం – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవం వైభవంగా నిర్వహించారు హిందూపురం పట్టణంలో పలుచోట్ల ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొని వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళి అర్పించారు వైఎస్ జగన్ స్థాపించిన వైసిపి పార్టీ ప్రజల అండదండలతో అధికారంలోకి రావడం కార్యకర్తలు ప్రజలే కారణమని పలువురు పేర్కొన్నారు పటములో కొన్నిచోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పరిగి మండలంలోని వైఎస్ఆర్ సర్కిల్ లో మంత్రి సోదరుడు నల్గొండ రవీంద్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాయకులు కార్యకర్తలతో ఘనంగా జరుపుకున్నారు. పరిగి మండలం మోద గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైసిపి నాయకులు మారుతి రెడ్డి ఆధ్వర్యంలో మోద చౌరస్తాలో వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజల కోసం 10 సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణతో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారం చేపట్టిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజన్న రాజ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజానీకం అండదండలు ఆశీర్వాదాలు ఉండాలని వైఎస్సార్ పార్టీ జిల్లా సెవాదల్ ప్రధాన కార్యదర్శి మారుతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి అంజి హనుమంతు హనుమయ్య పూజారి మారెప్ప రామంజి అశోకు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement