Sunday, May 5, 2024

కొత్తచెరువు ప్రభుత్వ వైద్యశాలలో…ప్రజలకు మెరుగైన సేవలు…

కొత్తచెరువు. – మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల పి హెచ్.సి నుండి 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ కావడంతో నలుగురు వైద్యనిపుణులు డెప్యుటేషన్ పైన వైద్యశాలకు వచ్చారని దీనీతో ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని శ్రీనివాస్ బాబు తెలిపారు.నల్లమాడ వైద్యశాల నుండి డాక్టర్.గోపికృష్ణ జనరల్ ఫిజీషియన్, ధర్మవరం వైద్యశాల నుండి డాక్టర్ నీరజ స్త్రీ వైద్య నిపుణులు(గైనకాలజీ) గురువారము,శుక్రవారము,శనివారం వైద్యశాలలో అందుబాటులో ఉంటారన్నారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ వైద్యశాల నుండి చిన్న పిల్లల వైద్య నిపుణులు సుధాకర్ సోమవారం, మంగళవారం,బుధవారం అందుబాటులో ఉంటారని అదేవిధంగా డాక్టర్.రూపాదీక్షిత్ పైథలాజిస్ట్ ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని కావున కొత్తచెరువు,పుట్టపర్తి బుక్కపట్నం మండలాల్లోని ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement