Saturday, May 18, 2024

మత్తు పదార్థాల సాగు చేస్తే కఠిన చర్యలు

ముదిగుబ్బ మండలంలోని వివిధ గ్రామాలలో మత్తుపదార్థాలు తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు .ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో డ్రోన్లు తో మత్తుపదార్థాలను వాటి ద్వారా కనిపెట్టడం జరుగుతుందన్నారు. గంజాయి ,గసగసాలు పంట సాగు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ధర్మవరం ఎక్సైజ్ సీఐ భీమ లింగ ఆధ్వర్యంలో మండలంలోని కొడవండ్ల పల్లి , ఈదులపల్లి , తదితర గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఎక్కడినుంచో వచ్చి భూములను లీజుకు అడిగి వాటిలో గస గ స పంటలు సాగు చేస్తే వారిపై సమాచారం అందించాలని రైతులకు తెలిపారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement