Sunday, May 12, 2024

అనంత‌లో విషాదం – ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ‌హ‌త్య‌..

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని ఎర్రగుంట్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన రామకృష్ణ (43), ఆయన భార్య రాజేశ్వరి (38), కుమారుడు దేవేంద్ర (14) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement