Wednesday, May 8, 2024

గుడివాడ చేరుకున్న అమ‌రావ‌తి రైతులు-క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య కొన‌సాగుతోన్న‌ మ‌హాపాద‌యాత్ర‌

గుడివాడ‌లోకి ప్ర‌వేశించింది అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లికి రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌. దాంతో గుడివాడ ప్రజలు రైతులకు సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడొచ్చన్న నేపథ్యంలో పట్టణంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున రోప్ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. గుడివాడ చేరుకున్న రైతులను పోలీసులు రోప్ ల నడుమ ముందుకు తీసుకెళుతున్నారు. ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు బైక్ పై గుడివాడ చేరుకున్నారు.
గుడివాడలో రైతుల పాదయాత్ర నేపథ్యంలో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చింతమనేని గుడివాడ వెళతారన్న అంచనాల నేపథ్యంలో ఏలూరులోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చింతమనేనికి నోటీసులు అందజేశారు. అయితే ఆయన నోటీసులు తిరస్కరించినట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement