Saturday, April 27, 2024

ప్రకాశ్ రాజ్ కోసం అభిమాని పాదయాత్ర

కరోనా కాలంలో రియల్ హీరో అయిన సోనుసూద్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఆయనను కలిసేందుకు పాదయాత్రలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కోసం ఓ తెలుగు అభిమాని పాదయాత్ర చేపట్టాడు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల్లో  ప్రకాశ్‌ రాజ్ కూడా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశ్ రాజ్ గెల‌వాల‌ని కోరుకుంటూ తూర్పుగోదావరి జిల్లా  కోలమూరు ప్రాంతం నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు రంజిత్ కుమార్ అనే అభిమాని పాదయాత్ర చేస్తున్నాడు.

రంజిత్ దాదాపు 485 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ విషయం నటుడు ప్రకాశ్‌ రాజ్ దృష్టికి వెళ్లింది. త‌న కోసం ఓ అభిమాని చేస్తోన్న పాద‌యాత్ర గురించి తెలుసుకుని ఆయన చ‌లించిపోయారు. దీంతో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాద‌యాత్ర‌ను విర‌మించుకోవాల‌ని సూచించారు.

‘’రంజిత్ బంగారం నిస్వార్థం తో కూడిన మీలాంటి వారి అభిమానమే కళాకారుడిగా నన్ను ముందుకు నడిపిస్తోంది. మీ ప్రయత్నం నా మనసుకు బాధ కలిగిస్తోంది. నా మాటగా తిరిగి మీరు ఇంటికి వెళ్లి ఆనందంగా ఉండండి. త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసి మాట్లాడతాను. నా మాట విన్నందుకు సంతోషంగా ఉంది.’’ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండిః ఏపీలో ప్రభుత్వ బడుల సమయం పెంపు.. స్కూల్ టైమింగ్స్ ఇవి

Advertisement

తాజా వార్తలు

Advertisement