Thursday, May 2, 2024

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

అడ్డతీగల (ప్రభ న్యూస్) : ఏజెన్సీ అడ్డతీగల మండలంలోని భీముడు పాకలు గ్రామంలో ఇవాళ ఉదయం 11గంటలకు విద్యుత్ షాక్ తగిలి నేబుల సత్తిబాబు (29) అనే గిరిజన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మృతుడు సత్తిబాబు తన పెంకుటిల్లుపై కప్పు నుండి వర్షం నీరు ఇంటిలోకి రావడం జరుగుతుంది.

దీన్ని అరికట్టేందుకు సత్తిబాబు ఇంటిపైకి ఎక్కి టార్పాలిన్ కట్టేందుకు ప్రయత్నిస్తుండగా, తన ఇంటి విద్యుత్ సర్వీసు వైర్లు తగలడంతో విద్యుత్ షాక్ కి గురై క్రింద పడిపోయాడు. అతన్ని వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించేలోపే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు సత్తిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో భీముడు పాకలు గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనతో మృతుడు సత్తిబాబు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement