Sunday, May 5, 2024

Jukkal: గొర్రెలు, మేకల పెంపకందార్లు ఆర్థికంగా ఎదగాలి

జుక్కల్… గొర్రెలు, మేకల పెంపకందార్లు ఆర్థికంగా ఎదగాలని పశువైద్య, పశుసంవర్ధక శాఖ మద్నూర్ ఎ.డి వెంకటేష్, జుక్కల్ ఇంచార్జి పశువైద్య అధికారి విజయ్ కుమార్, హాంగర్గ సర్పంచ్ భర్త హన్మంత్ అన్నారు. బుధవారం జుక్కల్ మండలంలోని హాంగర్గ గ్రామంలో గొల్లకుర్మ కులస్తులకు తెలంగాణా ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై మంజూరైన 6 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు.

ఎక్కడ లేని విధంగా తెలంగాణలో గొర్రెల పెంపకందార్లు అందరితో సమానంగా ఆర్థికంగా ఎదగాలని తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాబట్టి ఎవ్వరు కూడా పంపిణీ చేసిన గొర్రెలను అమ్ముకోకుండా గొర్రెల సంతతి పెరిగేవిధంగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా లబ్దిదారులైన గొల్ల, కుర్మలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement