Wednesday, May 1, 2024

విద్యుద్ఘాతంతో యువకుడు మృతి..!

పీలేరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : పీలేరు పట్టణం స్థానిక తిరుపతి రోడ్డులో నివసించే రాజు అనే యువకుడు విద్యుద్ఘాతంతో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు తిరుపతి రోడ్డులో నివాసమున్న వ్యాపారస్తుడు బాబు కుమారుడు రాజు పట్టణంలోని తన స్వగృహం ఆవరణలో బ్యానర్ కట్టే ప్రయత్నంలో విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement