Wednesday, May 8, 2024

పోలీసులపై దూసుకెళ్లిన కారు

విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు గాయపడిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై గుర్తు తెలియని కారు అతి వేగంగా వచ్చి విధులలో ఉన్న పోలీస్ సిబ్బంది మీదకి దూసుకెళ్లింది. అంతేకాదు రోడ్డుపై ఉన్న రెండు బారికేడ్లను 50 మీటర్ల మేర ఈడ్చుకెల్లి పక్కన ఉన్న డివైడర్ ని ఢీకొట్టి ఆగిపోయింది. విధుల్లో ఉన్న ఇద్దరు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటేశ్వర రావు అనే హెడ్ కానిస్టేబుల్ కి కాలు విరిగింది. కారు డ్రైవర్ మధ్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతను కర్నూల్ టౌన్ బాలాజీ నగర్ కి చెందిన యశ్వంత యాదవ్ గా గుర్తించారు. కారులో మద్యం బాటిల్స్ ని గుర్తించారు. మద్యం మత్తులో అజాగ్రత్తగా కారుని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన సిబ్బంది వెంకటేశ్వరరావు ను, పరుశురాం ను అడిషనల్ ఎస్పీ (జాయింట్ డైరెక్టర్) తూహిన్ సిన్హా  పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement