Wednesday, May 1, 2024

మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ నిరసన – నల్లజెండాలతో ర్యాలీలో పాల్గొన్న మంత్రి పువ్వాడ

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్ లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంత‌రం తెరాస శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లజెండాలను ధరించి మోడి డౌన్ డౌన్ అంటు నినాదాలు చేస్తు మోటార్ సైకిల్స్ పై తెరాస జిల్లా పార్టీ కార్యాలయం నుండి గట్టయ్యా సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్, జడ్పి సెంటర్, వైరా రోడ్, పాత బస్టాండ్ సెంటర్, మున్సిపల్ రోడ్, కస్బా బజార్, అద్దంకివారి వీధి, చర్చ కాంపౌండ్, బొనకల్ క్రాస్ రోడ్, తుమ్మలగడ్డ, జమ్మిబండ, నుండి జడ్పి సెంటర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement