Sunday, April 28, 2024

యాంకర్ గా సోనూసూద్

బాలీవుడ్, టాలీవుడ్ లలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ బుల్లితెరపైకి, ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది హోస్ట్‌గా కూడా మారుతున్నారు. ఎన్టీఆర్‌, నాగార్జున, బాలకృష్ణ, సమంత, సల్మాన్ ఖాన్, కంగన రనౌత్‌.. లాంటి స్టార్స్ అంతా హోస్ట్‌గా మారి ప్రేక్షకులని అలరిస్తున్నారు.
అయితే తాజాగా సోనూసూద్‌ కూడా ఈ జాబితాలోకి చేరనున్నారు. తాజాగా ఓ షోకి యాంకర్ గా మారబోతున్నట్టు సోనూసూద్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎంటీవీ రోడీస్ టీవీలో సోనూ సూద్ యాంకర్ గా రానున్నారు. ఇటీవల సోనూసూద్ సోదరి రాజకీయాల్లోకి రావడంతో సోదరి కోసం ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. సోనూ సూద్ అంటే తెలియని వారుండరు. కరోనా కష్ట కాలంలో, ఆ తర్వాత కూడా ఎంతోమందికి సహాయం చేసి, ఎంతోమందికి ప్రాణదానం చేసి చాలామందికి ఆపద్బాంధవుడిగా సోనూసూద్ మారారు. ఇప్పటికి కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement