Monday, May 13, 2024

Trains : ప‌లు రైళ్ల ర‌ద్దు… మ‌రికొన్ని దారి మ‌ళ్లీంపు

అలమండ-కంటకాపల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘ‌ట‌న‌తో ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. విజ‌య‌వాడ‌-విశాఖ‌, విశాఖ‌-విజ‌య‌వాడ ఎక్స్ ప్రెస్‌, గుంటూరు-విశాఖ‌ప‌ట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, కాకినాడ‌-విశాఖ‌ప‌ట్నం మెమూ ఎక్స్‌గ్రెస్‌, విశాఖ‌ప‌ట్నం-కాకినాడ‌ మెమూ ఎక్స్‌గ్రెస్‌, రాజ‌మండ్రి-విశాఖ మెమూ స్పెష‌ల్‌, విశాఖ‌-రాజ‌మండ్రి మెమూ స్పెష‌ల్‌,గుంటూరు-రాయ‌గ‌డ ఎక్స్‌ప్రెస్‌, కోరాపూట్‌-విశాఖ‌, విశాఖ‌-కోరాపూట్ స్పెష‌ల్‌, ఎంజీఆర్ చెన్నై సెంట్ర‌ల్‌-పూరి ఎక్స్‌ప్రెస్‌, రాయ‌గ‌డ‌-గుంటూర్‌, విశాఖ‌-గుంటూర్ ఎక్స్‌ప్రెస్‌ల‌ను ర‌ద్దు చేశారు.

అలాగే ప‌లు రైళ్ల‌ను దారి మ‌ళ్లీస్తున్నారు. విజ‌య‌వాడ‌-జార్సుగూడ రైలు ఖ‌రాగ్‌పూర్ మీదుగా, మంగ‌ళూరు సెంట్ర‌ల్‌-సంత్రాగ‌చ్చి ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-హౌరా ఫ‌ల‌క్‌నామా ఎక్స్‌ప్రెస్‌, బెంగుళూరు-జాసిదిహ్ ఎక్స్‌ప్రెస్‌, బెంగుళూరు-హౌరా, చెన్నైసెంట్ర‌ల్‌-హౌరా మెయిల్‌, వాస్కోడిగామా-షాలీమారీ ఎక్స్‌ప్రెస్‌ల‌ను దారి మ‌ళ్లీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement