Wednesday, May 1, 2024

మునుగోడు ఉప ఎన్నిక‌-బిజెపి స్టీరింగ్ క‌మిటీ భేటీపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కి ముందే బిజెపి ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టిస్తుంద‌ని..ఈడీ కంటే ముందుగానే సోదాలు చేసేవారి పేర్లు చెబుతున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు మంత్రి కేటీఆర్. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్‌ కమిటీ భేటీపై కేటీఆర్ ఆదివారం ట్విట్టర్‌ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.మునుగోడు ఉప ఎన్నికలకు 15లోపు షెడ్యూల్‌ వస్తుందని, ఐదెంచెల వ్యూహంతో విజయం సాధించాలని బీజేపీ స్టీరింగ్‌ కమిటీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలనుద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన వార్తను కేటీఆర్‌ ట్యాగ్‌ చేశారు. ఎన్‌ఐఏ కంటే ముందే బ్యాన్‌ విధిస్తున్నారని, ఐటీ అధికారుల కంటే వేగంగా నగదు వివరాలు చెబుతున్నారని, సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు చెబుతున్నారన్నారు. భారతీయ జనా ఈసీ-సీబీఐ-ఎన్‌ఐఏ-ఈడీ..పీగా పేరు మార్చుకోవాలంటూ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement