Wednesday, May 15, 2024

కర్ణుని ఆవేదన… శ్రీకృష్ణుని ఓదార్పు!

మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రలైన కృష్ణు డు, కర్ణుడు మధ్యన కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఓ సంభాషణ జరిగింది. ఆ సమయంలో కర్ణుడు కృష్ణుడుని ఇలా అడిగాడు-
”నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా.. కాదే.. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించా రు.. ఎందుకంటే నేను క్షత్రియుడిని కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రి యుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయే లా నాకు శాపం పెట్టారు.
పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు. ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్ప టం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే.. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే.. అలాంట ప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవు తుంది?” అని ప్రశ్నించాడు కర్ణుడు.
దానికి కృష్ణుడు కర్ణునికి సమాధానం ఇలా చెప్పాడు…
”నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను. నేను పుట్ట టం కంటే ముందే నా చావు… నా కోసం కాచుకుని కూర్చుం ది. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రుల నుండి వేరు చేయబడ్డాను. చిన్నతనంలో నువ్వు కత్తులు, రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను. నా చిన్నతనం లో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు. కానీ ఎన్నో దాడులు ఎదురొన్నాను. నా చుట్టూ ఉన్న వారు వారి సమ స్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా.. నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చు కునేందుకు నోచుకోలేదు కూడానూ. సాందీపుని ఋషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివా#హం చేసుకోగలిగావు.
నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను. పైగా నన్ను వివా#హం చేసుకున్నవారు.. వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండి కాపాడబడిన వారు కొందరూనూ.
జరాసంధుని బారి నుంచి కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమున వడ్డు నుంచి దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపో యాడు అన్న చెడ్డపేరు నాకొచ్చింది. సరే ఇంతకీ దుర్యోధ నుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుం ది. అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు… పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన… ఒకటి గుర్తుంచుకో కర్ణా.. జీవితంలో సమస్యలు, సవాళ్ళు అంద రికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు కానీ, యుధిష్టరుడు కానీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు.. మనకు ఎంత అన్యాయం జరిగినా.. మన కు ఎన్ని పరాభవాలు జరిగినా.. మనకు రావల్సినది మన కు అందకపోయినా… మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. అదే చాలా ముఖ్యమైన ది కూడా. మనం జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, చెడు అనుభవాలను అధర ్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా తీసుకోకూడదు. మనం బాధపడ్డామని జీవి తాన్ని చెడు మార్గం లోకి నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు. ధర్మమే మన శ్వాసగా జీవితం కొనసాగించాలి” అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement