Sunday, May 5, 2024

ఏ ఎస్.ఐ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం..సెంట్రల్ జోన్ డీ సీ పీ. పుష్ప..

భీమదేవరపల్లి :వంగర పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్ ఐ గా పని చేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హాబిద్ పాషా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప అన్నారు. హన్మకొండ మాక్స్.కేర్ ఆసుపత్రి లో హాబిద్ మృతదేహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాబిద్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు .పోలీస్ శాఖ.పరంగా వచ్చే బెనిఫిట్స్ తో పాటు వారి కుటుంబానికి పోలీస్ శాఖ ద్వారా సహాయ,సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. డీసీపీ పుష్పవెంట సిఐ శ్రీనివాస్ జీ, వంగర ఎస్.ఐ గంజి.స్వప్న వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement