Tuesday, May 7, 2024

స్వీయ నియంత్రణ అవసరం..

కవాడిగూడ : కరోనా వైరస్‌ ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని ముషీరాబాద్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎం సుప్రియ నవీన్‌గౌడ్‌ సూచించారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరు సహాకరించి ఇంటికే పరిమితం కావాలని కోరారు. డివిజన్ లోని బాపుజీనగర్‌, గంగపుత్ర కాలనీ ప్రాంతాలలో శానిటైజర్‌ చల్లించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ కరోనావైరస్‌ అరికట్టెందుకు ప్రతి ఒక్కరు పరిశుభ్రత, స్వీయ నియంత్రణ, సామాజిక దూరం, మాస్క్‌ ధరించడం తప్పని సరిగా పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ నివారణకు అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రజల క్షేమం కోసం అందరూ పోలీసుల ఆదేశాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని సుప్రియ నవీన్‌గౌడ్‌ అన్నారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు అందరూ ఇండ్లకే పరిమితమై కరోనా వైరస్‌ నివారణకు సహాకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం లో బిజెపి నేతలు నవీన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement