Tuesday, May 7, 2024

NZB : బీజెపీ భారీ బైక్ ర్యాలీ

నిజామాబాద్ రూరల్, నవంబర్ 10( ప్రభ న్యూస్)
రూరల్ నియోజక వర్గంలో బీజెపీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఎన్నికల ప్రచార వాహనం పై ఊరేగింపు గా దినేష్ నామినేషన్ కు హాజరయ్యారు. డిచ్ పల్లి ఇంధల్ వాయి ధర పెల్లి సిరికొండ జాక్రణ్ పల్లి నిజామాబాద్ రూరల్ నుండి కార్యకర్తలు యువకులు భారీగా వచ్చి హెలీ క్యాప్టర్ పై వచ్చిన ఈటెల కు భారీ ఘన స్వాగతం పలికారు.

బీజేపీ పార్టీ రూరల్ అభ్యర్థి దినేష్ అసెంబ్లీ రూరల్ ఇంచార్జి పద్మా రెడ్డి వివిధ మండలాల బీజెపి అద్యక్షులు ఆయనకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాధవ నగర్ వద్ద ఈ టెల ఎన్నికల ప్రచార రథం పై నుండి మాట్లాడారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఇంకెంత కాలం మోసం చేస్తుందని ఈ పార్టీని తరిమి కొట్టాలని కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రాజెక్టుల పేరుతో కే సీ ఆర్ నిలువు దోపిడీ చేస్తూ అప్పుల తెలంగాణ గా మార్చారని మళ్ళీ ప్రజలను మోసం చేయడానికే వస్తున్న డని ఆలోచించి ఓటు ను వినియోగించుకోవా లన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement