Thursday, May 9, 2024

వైసీపీ బీజేపీ మధ్య ఘర్షణ… రాళ్లతో దాడులు

వైసీపీ బీజేపీ మధ్య ఘర్షణ… రాళ్లతో దాడులునెల్లూరు జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, బీజేపీ వర్గీయుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 11 మందికి గాయాలుకాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా మారింది. గాయపడ్డవారిని గూడూరు, నెల్లూరు ఆస్పత్రులకు తరలించారు. గురువారం సాయంత్రం నుంచి గ్రామంలో ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఓ స్థలం విషయంలో ఈ ఘర్షణ మొదలైనట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement