Monday, May 6, 2024

హైవేపై దూసుకొచ్చిన మృత్యువు.. నలుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పుల్కల్ మండలం చౌటకూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement