Saturday, May 4, 2024

జూన్ రెండో వారంలో తెలంగాణలోకి నైరుతి..

వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. అండమాన్, నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు తెలిపింది. త్వరలోనే ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలు, నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్ సుమద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు నిన్ననే ప్రవేశించినట్టు భారత వాతావరణ పరిశోధన శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 31 ఇవి కేరళను తాకనున్నాయని, జూన్ రెండో వారంలో రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని ఐఎండీ గతవారమే తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement