Saturday, April 20, 2024

నిర్మాత బి ఏ రాజు మృతి

ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు మృతి చెందారు. మధుమేహంతో బాధపడుతున్న బి.ఏ.రాజు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో చనిపోయారు. మధుమేహం ఎక్కువై లెవెల్స్ మారటం తో అస్వస్థతకు గురయ్యారు. అదే సమయంలో గుండెపోటు వచ్చి ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

రాజు ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు పిఆర్ఓ గా పని చేశారు. అలాగే సినీ పరిశ్రమకు ఇటు అభిమానులకు మధ్య ఓ వారధి గా కూడా వ్యవహరించారు. 2018 లో రాజు భార్య కూడా చనిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇక రాజు మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement