Tuesday, April 30, 2024

జగిత్యాల జిల్లాలో కొత్త కరోనా కలకలం

కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ కొత్త స్టెయిన్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో ఈ వైరస్ మూలాలు బయటపడ్డాయి. ఇటివలే దుబాయ్ నుండి వచ్చిన ఓ వ్యక్తి నుండి గత నెల 25న శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. తాజాగా అతడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు అతడి కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయగా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే అతడు దుబాయ్ నుంచి యూకే మీదుగా వచ్చాడు.  యూకేలో కరోనా సెకండ్ స్ట్రెయిన్ వుంది కాబట్టి అక్కడ ఏమయినా కరోనా సోకిందా అన్న అనుమానాన్ని వైద్యసిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అటు కోరుట్ల మండలం వెంకటాపూర్‌లోనూ ఓ వ్యక్తికి ఇదే రకమైన కొత్త స్టెయిన్ సోకినట్లు గుర్తించడంతో హైదరాబాద్‌కు తరలించారు. జిల్లాలో ఒకేసారి రెండు ప్రాంతాలలో కరోనా కొత్త స్టెయిన్ బయటపడటంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement