Sunday, May 5, 2024

హస్తినలో రాహుల్‌తో మధుయాష్కీ మంతనాలు

తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత టీపీసీసీలో మార్పులు రానున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో మంతనాలు జరిపారు. టీపీసీసీకి కొత్తగా ఏర్పాటు చేసే కమిటీలో సామాజిక న్యాయం ఉండేలా చూడాలని ఆయన రాహుల్‌ను కోరారు. కమిటీలో కీలకమైన అధ్యక్షుడు, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులను ఒకే సామాజికవర్గానికి ఇవ్వొద్దని సూచించారు. అటు తెలంగాణలో పార్టీ పరిస్థితులపైనా రాహుల్‌తో మధుయాష్కీ చర్చించారు. త్వరలో తెలంగాణలో పర్యటించాలని, రాష్ట్ర నేతలతో సమావేశం కావాలని కోరారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రచారపర్వంలో బిజీగా ఉన్నారని… ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన వెంటనే తెలంగాణ పర్యటనను ఖరారు చేస్తానని రాహుల్ తనతో చెప్పారని మధుయాష్కీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement