Thursday, May 16, 2024

Flash: యాద్రాదిలో ఉద్రిక్తత… న్యాయం చేయాలని ధర్నా

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. యాదగిరిగుట్టలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు, చుట్టు ఉన్న గ్రామాల, మండల ప్రజల వాహనాలను కొండపైకి అనుమతించాలని స్థానికులు డిమాండ్ చేశారు. స్థానికంగా ఉపాధి కోల్పోతున్న 300 మంది ఆటోవాలాల కుటుంబాలకు ఉపాధి చూపాలని కోరుతూ ఆదివారం ఆటోవాళ్ళతో కలసి నాయకులు ధర్నా నిర్వహించారు. ఆటోలు కొండపైకి అనుమతించాలని డిమాండ్ చేసారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement