Saturday, April 27, 2024

Nirmal: నీ ఐడియా అదిరిందన్న రైతన్న… ఎద్దుల కొరతను ఎలా జయించాడో చూడండి..

వ్యవసాయానికి బసవన్నల సాయం తగ్గుతోంది. ఎద్దుల కొరతతో సన్నకారు చిన్న కారు రైతులకు కష్టాలు తప్పడం లేదు. దుక్కులు దున్నాలంటే ట్రాక్టర్ల కోసం అధికంగా ఖర్చు చేయక తప్పడం లేదు. అరక పట్టి దుక్కి దున్నేందుకు బసవన్నలు లేకపోతే ఏం ఇంట్లో బండుంది కదా అంటూ ఓ రైతన్న సరికొత్త ఐడియాతో కొడుకు సాయంతో దుక్కులు దున్ని సాల్లు పెట్టి పంట సాగు చేసేందుకు సిద్దమయ్యాడు. అదెలాగో మీరే ఓ లుక్కేయండి.

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు సొంకాంబ్లీ బాబు.. ఊరు నిర్మల్ జిల్లా ముథోల్.. దుక్కులు దున్నేందుకు ఎద్దుల కొరతతో యంత్రాలతోనైనా సాగు చేద్దామనుకున్నాడు. ట్రాక్టర్ల కోసం ప్రయత్నం చేసినా సీజన్ కావడంతో ట్రాక్టర్లు రేట్లు దండిగా పెంచేశారు. చేసేది లేక ఇదిగో ఇలా ఇంటి వాహనాన్నే వ్యవసాయానికి సాయంగా వాడేశాడు. ముదోల్ మండల కేంద్రానికి చెందిన సొంకాంబ్లీ బాబు అనే రైతు తన పంట చేనులో వేసిన పత్తి పంటలో గుంటుకు కొట్టడానికి వినూత్నంగా ఆలోచించాడు. తనకున్న లూనాతో పంట చేనులో వ్యవసాయ పనులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

లూనాను ఇలా వ్యవసాయ పనులకు వాడటంతో ఇదేదో బాగుందే అంటూ ఆ ప్రాంత రైతులు కూడా అదే బాటపట్టారంట. అదిరిందయ్యా కాంబీ అంటూ బాబును పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారంట. విభిన్నమైన ఆలోచనలతో వినూత్న పనులు చేపట్టవచ్చని నిరూపించిన రైతు సొంకాంబ్లీని సమీప ప్రాంత రైతులు అభినందిస్తున్నారు. గుంటుకు కొట్టడానికి ఎడ్లు లేకున్నా తన లూనాను ఉపయోగించి వ్యవసాయ పనులు పూర్తి చేయడంతో ఖర్చు కలిచి వచ్చిందంటున్నాడు కాంబ్లీ. ఎకరంనర భూమిలో వేసిన పత్తిలో ఇంటి పనులకు వాడే లూనాను ఇలా గుంటుకు కొట్టడానికి వాడక తప్పలేదని తెలిపాడు. తన కొడుకు సాయం కూడా ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కేలా చేసిందని తెలిపాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement