Friday, April 26, 2024

TS : యువ‌తికి మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం…

యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్ప‌డిన‌ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ వద్ద నగ్న చిత్రాలు ఉన్నాయంటూ.. చెప్పినట్లు వినకపోతే వాటిని బయటపెడతామంటూ ఆ ఇద్దరూ యువతిపై వేధింపులకు దిగారు. ఈక్రమంలోనే ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఏడాది క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ బోరబండ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఘటన ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరగడంతో కేసును అక్కడికే బదిలీ చేశారు. పోలీసుల వివరాల మేరకు ఎల్బీనగర్‌ పరిధిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ డిగ్రీ చదివే యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రణవ్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. దీంతో అతడు యువతి కళాశాల దగ్గర వెళ్లి కలిసేవాడు. గతేడాది యువతి కళాశాల వద్దకు వెళ్లిన ప్రణవ్‌ ఆమెను ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తానని బైక్‌పై తీసుకెళ్లాడు.

- Advertisement -

అయితే ఆమెను ఇంటికి తీసుకెళ్లకుండా హోటల్‌కు తీసుకెళ్లి.. తాగునీటిలో మత్తుమందు కలిపిచ్చి స్పృహ కోల్పేయేలా చేశాడు. ఆ తర్వాత మరో యువకుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన యువతి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే 2 నెలల క్రితం యువతి కుటుంబం బోరబండకు మకాం మార్చారు. ఈ నేపథ్యంలోనే యువతికి ఆ ఇద్దరు మళ్లీ ఫోన్‌ చేశారు. తాము చెప్పినట్లు వినాలని.. లేదంటే నగ్నచిత్రాలు బయటపెడతామంటూ వేధింపులకు దిగారు. దీంతో ఆ యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి.. వారితో కలసి బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement