పెళ్లి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలాడు 19ఏళ్ల యువకుడు. నిర్మల్ జిల్లా పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. కాగా రాత్రి పార్డిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికుమారుని బంధువు, మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19).. ఈ వేడుకకు హాజరయ్యాడు. అప్పటిదాకా డ్యాన్స్ చేసిన అతడు.. ఉన్నట్టుండి ఆగిపోయి.. అలానే కిందికి పడిపోయాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement