Saturday, April 20, 2024

బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమం : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

భారత రాష్ట్ర సమితితోనే సంక్షేమం సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాల్వశ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు గులాబీ గూటిలో చేరారు. కాంగ్రెస్ వార్డు మెంబర్ లు తీగల సంపత్, పెండ్లి తిరుపతి,కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూస నాగరాజు, మంద రంజిత్, ముస్కు కుమార్, మంద హరీష్, కంప శంకర్, కదురు రాజయ్య, ఎరుకల సాగర్ లకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి భారత రాష్ట్ర సమితి లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, ఛైర్మెన్ మాదిరెడ్డి నరసింహా రెడ్డి, సర్పంచ్ మంద రమా-వెంకన్న, ఎంపీటీసీ పెండ్లి సంపత్,తీగల నాగరాజు,కదురు రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్ ఎరుకల మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు కూస హరీష్, కూస శ్రీనివాస్,ఓల్లాల కొమురయ్య, పెండ్లి రాజేందర్, కదురు రాజ్ కుమార్,కూస రవి, బీ ఆర్ స్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement