Monday, April 29, 2024

మనిషికి, ప్రకృతికి ఉన్న అనుబంధానికి యోగానే నిదర్శనం : గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధానికి యోగా ఒక నిదర్శనమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏటా జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినంగా నిర్వహిస్తున్నారు. యోగా మనసుని , శరీరాన్ని ఒక్కటి చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారని గవర్నర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు యోగా ఉత్తమ మార్గమని చెప్పారు.

యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా కృషిచేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత సనాతన సంస్కృతిలో యోగా ఒక భాగమన్నారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ నిత్యం యోగా చేయటం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు వ్యాధి నిరోధకతను పెంచుకోవాల్సి ఉందని , ఇమ్యూనిటీని సాధించటం యోగాతో సాధ్యమని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement