Friday, May 3, 2024

Yadadri – మూల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్స్ – ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య

ప్రభన్యూస్, ప్రతినిధి / యాదాద్రి – ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి-సంగ్య తండా మధ్యలోని కెనాల్ వద్ద ఉన్న ప్రమాదకరమైన మూలమలుపులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే అధికారులు మూల మలుపు వద్ద వైట్ స్పీడ్ బ్రేకర్స్,భారీ గేట్స్,రేడియం స్టికర్స్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదాలు నివారించవచ్చని చర్యలు చేపట్టారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి వెంటనే చర్యలు చేపట్టినందుకు గాను స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement