Monday, May 13, 2024

తాడికల్ శివాలయంలో మహిళ హత్య..

శంకరపట్నం – కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలోని శివాలయంలో ఓ మహిళ ఆదివారం హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలం, భీంపల్లి గ్రామానికి చెందిన గుండారపు ప్రమీల అనే మహిళ గత మూడు రోజుల క్రితం అర్కoడ్ల గ్రామానికి తన తండ్రి ఇజ్జిగిరి కొమురయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో వచ్చింది. ప్రమీల ఆదివారం ఉదయం అర్కండ్ల నుండి తన తండ్రి కొమురయ్యను తీసుకొని మొలంగూర్ కు బయలదేరింది..ఆమె ఆ సమయంలోనే హత్యకు గురైంది.. ఆమె వద్ద ఉన్న బంగారు నగల కోసమే ఈ హత్యను చేసినట్లు భావిస్తున్నారు.. సమాచారం తెలుసుకున్న కేశవపట్నం ఎ ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి, హోంగార్డు రవి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement