Monday, July 22, 2024

TS: ఇండియా కూట‌మి అధికారంలోకి వస్తుంది : సీఎం రేవంత్


336 సీట్లలో పోటీ చేస్తే.. 400 సీట్లు ఎట్లా సాధ్యం?
దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోంది
ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై ఏపీలో కూట‌మి ఎందుకు చెప్ప‌డం లేదు
కొడంగల్ లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇండియా కూట‌మి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగ‌ల్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయన్నారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు. సెప్టెంబర్ 17, 2025తో మోదీ 75 ఏళ్లు నిండుతాయి. ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలన్నారు.

దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమ‌న్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది.. 400 సీట్లు ఎట్లా సాధ్యం? అని ప్ర‌శ్నించారు. 13 ఏళ్లు సీఎంగా, 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదని ప్ర‌శ్నించారు. దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారన్నారు.

- Advertisement -

ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతోంటే… మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందన్నారు. ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్ దీన్ని బట్టి తెలుస్తోందన్నారు. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధమ‌న్నారు. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందన్నారు. మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవన్నారు. నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్ పై చర్యలు లేవన్నారు. బీజేపీ నేతలపై ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయదన్నారు. కానీ ఒక వీడియో వైరల్ కేసులో త‌మపై ఎంహెచ్ఏ రంగంలోకి దిగిందన్నారు. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనమ‌న్నారు. బీజేపీ వాషింగ్ మెషిన్ లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా? అని ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ఒక్కటే అడుగుతున్నా.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండన్నారు. మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామ‌న్నారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదని రేవంత్ రెడ్డి అన్నారు.


లోక్ స‌భ‌ ఎన్నికలు త‌మ వంద రోజుల పాలనకు రెఫరెండమ‌న్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్ పై త‌నకు సానుభూతి ఉందన్నారు. మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement