Wednesday, May 15, 2024

Flash: విద్యుత్ షాక్ తో మహిళ సజీవదహనం.. ఇళ్లు సహా వస్తువులు దగ్ధం

ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధమై మహిళ సజీవ దహనం అయింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా కువరి మండలంలోని కంచర్ల కూడా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కంచర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ బిచ్చ, బాజు దంపతులకు నివాసం ఉండడానికి వారి కుమారుడు ఒక షెడ్ నిర్మించాడు. చుట్టూ గడ్డి గడ్డి పోరాకలతో ఆవాసం నిర్మించాడు. ప్రతి రోజులాగే బిచ్చ బాజు వారి పనులు ముగించుకొని నిద్రిస్తున్నారు. అయితే, ప్రమాదవశాత్తు మంగళవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలో లోపల నిద్రిస్తున్న బానోత్ బాజు (65) అక్కడికక్కడే సజీవ దహనం అయింది. గడప వద్ద నిద్రిస్తున్న భర్త బిచ్చ మంటలను ఆపడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆయన కూడా స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement