Saturday, May 4, 2024

భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

సంగారెడ్డి, జులై 22 (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి ఆ తర్వాత భర్త కూడా ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈ ఘటన శనివారం జరిగింది. స్థానిక ఎస్ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లి కాలనీ వీకర్ సెక్షన్లో నివాసం ఉంటున్న అల్లం యాదగిరి స్థానికంగా ప్లంబర్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా, శనివారం నాడు అతని భార్య యశోదను యాదగిరి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం యాదగిరి ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు ఈ సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement