Tuesday, May 7, 2024

Warngal : చెట్టును ఢీకొన్న కారు.. ఎస్ ఐ మృతి

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) : రోడ్డు ప్రమాదం ఓ ఎస్సైని బలి తీసుకుంది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం హట్యాతండా దగ్గర జరిగిన ప్రమాదంలో భద్రాద్రి జిల్లా డీసీఆర్బీ లో ఎస్సైగా పనిచేస్తున్న సోమ కుమారస్వామి (56) మృతి చెందారు. మృతుడిది వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామo. కారులో వెళుతుండగా కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement