Tuesday, May 7, 2024

అనుమాస్ప‌దంగా.. మృతి చెందిన సినీ క‌థా ర‌చ‌యిత‌

అవ‌కాశాలు రాక ఓ సినీ క‌థా ర‌చ‌యిత ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ట‌.ఆయ‌న వ‌య‌సు 50సంవ‌త్స‌రాలు. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తి సాగర్ చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి షేక్‌పేట్‌ పరిధిలో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఎన్నో కథలు రాసిన సాగర్.. అవకాశాల కోసం ప్రయత్నించాడు. సహాయ దర్శకుడిగా పని చేసేందుకు కాళ్లరిగేలా తిరిగినా ఆయనకు ఆవకాశం రాలేదు. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో టెర్రస్‌పై విగతజీవిగా కనిపించాడు. ఉదయాన్నే లేచిన స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కీర్తి సాగర్ అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అతని గదిలోకి వెళ్లి చూడగా.. గది నిండా తాను రాసుకున్న వందలాది కథలు కనిపించాయి. కీర్తి సాగర్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కానీ ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో మార్చురీ భద్రపరిచారు.ఆయన మరణంపై పలు అనుమానాలు రేకెత్తాయి. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement