Sunday, May 5, 2024

బర్రెని మేపడానికి వెళ్లి…మృత్యు ఒడిలోకి

వరంగల్ .. జిల్లా చెన్నారావుపేట మండలం బొజేర్వు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.గూడూరు మండలం అప్పర్షపల్లి గ్రామానికి చెందిన కాసాని మల్లయ్య-రవళి దంపతుల కుమారుడు రాజేశ్(11సంవత్సరాలు)బొజేర్వు కు చెందిన తన అమ్మమ్మ సుభద్ర ఇంటి వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదివాడు.వేసవికాలం సెలవులు కావడంతో అమ్మమ్మకు చెందిన బర్రెను మేపడానికి తోటి స్నేహితులతో కలిసి గ్రామ శివారు ప్రాంతానికి వెళ్ళాడు.బర్రెలు మేపుతుండగా అక్కడే ఉన్న ఓ కూలిపోయిన బావి(బొంద)లో ప్రమాదవశాత్తు కాలు జారీ అందులో పడిపోయాడు.అక్కడ ఉన్న వాళ్ళు గమనించి కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్ళు కాపాడదామని ప్రయత్నం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాపాయ్యపేట గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement