Saturday, May 4, 2024

నాలుగో రోజూ పాక్ డ్రోన్ కూల్చివేత..

మరో సారి పాక్ డ్రోన్ ను బలగాలు కూల్చివేశాయి. పంజాబ్‌లో మరోసారి పాకిస్థానీ డ్రోన్‌ పట్టుబడింది. అమృత్‌సర్‌ జిల్లాలోని భైనీ రాజ్‌పుతానా గ్రామం వద్ద ఓ డ్రోన్‌ అంతర్జాతీయ సరిహద్దును దాటడాన్ని బీఎస్‌ఎఫ్‌ బలగాలు గుర్తించాయి. దీంతో దానిపై కాల్పులు జరిపిన సైనికులు నేలకూర్చారు. దాని నుంచి ఓ కవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2.1 కిలోల హెరాయిన్‌ ఉన్నట్లు గుర్తించారు. కాగా, గత నాలుగు రోజుల్లో అమృత్‌సర్‌ జిల్లాలోనే ఐదు డ్రోన్లు పట్టుబడటం విశేషం. మే 19 తర్వాత పాకిస్థానీ డ్రోన్లను కూల్చడం ఇది ఐదో సారని బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement