Wednesday, May 1, 2024

టిక్కెట్ ఇవ్వ‌కుంటే ఆత్మ‌హ‌త్యేనంటూ టి ఆర్ ఎస్ నేత శోభారాణి వీరంగం..

వరంగల్: జిల్లాలో టికెట్ రాని అభ్యర్థుల నిరసనల పర్వం కొనసాగుతోంది. ఇప్ప‌టికే ఉద్య‌మ నాయ‌కుడు ద‌ర్శ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ హాల్ చేయ‌గా, తాజాగా మ‌రో మ‌హిళా నేత ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ ఏకంగా పెట్రోల్ సీసాతో భ‌వ‌నంపైకి ఎక్కి వీరంగం సృష్టించారు.. వివ‌రాల‌లోకి వెళితే వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ లో ఎన్నిక‌ల‌లో 58వ డివిజన్ టికెట్‌ను తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సీనియర్ నేత శోభారాణి బిల్డింగ్ పైకెక్కి నిరసనకు దిగారు. టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని శోభారాణి హెచ్చరించారు. ఒక చేతిలో పెట్రోల్ సీసా పట్టుకుని అంటించుకుంటానంటూ ఒక‌సారి, భ‌వనంపై నుంచి దూకుతాన‌ని మరోసారి బెదిరిస్తూ హాల్ చ‌ల్ చేశారు.. దీంతో విషయం తెలిసిన పోలీసులు శోభారాణిని కిందకు దించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement